అక్షరటుడే, వెబ్డెస్క్ :Maharashtra | వరుస విషాదాలు దేశాన్ని వెంటాడుతున్నాయి. ఇటీవల అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 274 మంది మృతి చెందిన ఘటన మరువక ముందే కేదార్నాథ్లో హెలికాప్టర్ కూలి ఆరుగురు చనిపోయారు. మహారాష్ట్ర(Maharashtra)లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోయి ఆరుగురు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. తాజాగా సోమవారం లక్నోలో సౌదీ ఎయిర్లైన్స్ విమానం టైర్కు నిప్పు అంటుకుంది. మరోవైపు మహారాష్ట్రలో ఓ రైలు(Train)లో మంటలు చెలరేగాయి. దీంతో వరుస ఘటనలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మహారాష్ట్రలోని దౌండ్ నుంచి పూణేకు వెళ్తున్న డెమూ రైలు(Demo train)లో సోమవారం ఉదయం మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు కోచ్లో వేగంగా వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం కలగలేదు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. రైల్వే అధికారులు(Railway officers) సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.