అక్షరటుడే, వెబ్డెస్క్ : IAF | పహల్గామ్ ఉగ్రదాడి pahalgam terror attack తర్వాత భారత్ యుద్ధ కసరత్తులు తీవ్రతరం చేసింది. సరిహద్దులో భారీగా సైన్యాన్ని, యాంటీ డ్రోన్ వ్యవస్థ, జామర్లను మోహరించింది.
తాజాగా ఉత్తరప్రదేశ్లోని గంగా ఎక్స్ప్రెస్వేపై ganga express way up భారత వైమానిక దళం IAF ఫ్లైపాస్ట్ నిర్వహించింది. యుద్ధం, జాతీయ అత్యవసర సమయాల్లో ప్రత్యామ్నాయ రన్వేగా ఎక్స్ప్రెస్వే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఈ విన్యాసాలు విజయవంతంగా పూర్తి చేసింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్పూర్లో shahjanpoor 3.5 కిలోమీటర్ల పొడవైన ఎయిర్స్ట్రిప్ గంగా ఎక్స్ప్రెస్వేలో భాగం. ఈ ఎయిర్షో ప్రత్యామ్నాయ రన్వేగా ఉపయోగించడానికి ఎక్స్ప్రెస్వే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడనుంది. ఈ ఎయిర్షోలో ఫైటర్ జెట్లు ఒక మీటర్ ఎత్తులో తక్కువ ఫ్లైపాస్ట్లను నిర్వహించాయి. తరువాత ల్యాండింగ్, టేకాఫ్ డ్రిల్స్ చేశాయి. శుక్రవారం రాత్రి సమయంలో మరోసారి డ్రిల్ చేయనున్నారు.