అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: TWJF | జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో (Private Educational Institutions) 50శాతం ఫీజు రాయితీ కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) (Telangana Working Journalists Federation) ప్రతినిధులు కోరారు. బుధవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డీఈవో అశోక్(DEO Ashok)కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భాస్కర్, రాంచందర్ మాట్లాడారు. జర్నలిస్ట్లు చాలీచాలని వేతనాలతో తమ కుటుంబాలను నెట్టుకొస్తున్నారని తెలిపారు. అయితే గతంలో విద్యాశాఖ నుంచి ఫీజు రాయితీ కల్పించాలని ఉత్తర్వులు వెలువడ్డపటికీ కొన్ని ప్రైవేట్ స్కూళ్లు రాయితీ కల్పించలేదని డీఈవో దృష్టికి తీసుకొచ్చారు.
డీఈవో స్పందిస్తూ ఫీజు రాయితీ కల్పిస్తామని తెలిపారు. రాయితీ ఇవ్వని విద్యాసంస్థల సమాచారం మా దృష్టికి తీసుకొస్తే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, జిల్లా ప్రతినిధులు పరమేశ్వర్, మధు, కృష్ణ పాల్గొన్నారు.