అక్షరటుడే, వెబ్డెస్క్ : UPI | ప్రస్తుతం దేశంలో ప్రజలు డిజిటల్ పేమెంట్లకు (digital payments) అలవాటు పడ్డారు. యూపీఐ ద్వారానే చాలా వరకు లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జేబులో పర్సు లేకున్నా.. నగదు లేకున్నా.. స్మార్ట్ ఫోన్ ఉంటే యూపీఐ (phone pay, google pay) ద్వారా పేమెంట్లు చేస్తున్నాం.
ప్రస్తుతం వీధి వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద మాల్స్ వరకు అన్నింట్లో యూపీఐ యాక్సెప్ట్ చేస్తున్నారు. దీంతో ప్రజలు ఎక్కువ శాతం తమ లావాదేవీలను యూపీఐ (UPI) ద్వారానే చేస్తున్నారు. అయితే యూపీఐ వినియోగదారులకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ (National Payments Corporation) గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి మరింత వేగంగా యూపీఐ సేవలు అందనున్నాయి. ప్రజల సమయం ఆదా చేయడానికి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఈ నిబంధన జూన్ 16(సోమవారం) నుంచి అమలు కానుంది.
UPI | ఆదా కానున్న సమయం
యూపీఐ ద్వారా లావాదేవి చేస్తే అది పూర్తి కావడానికి 30 సెకన్లు పడుతోంది. మనం క్యూ ఆర్ కోడ్ (QR code) స్కాన్ చేసి, సక్సెన్ అని వచ్చాక దుకాణదారుడికి చూపిస్తాం. అయితే ఈ ప్రాసెస్ పూర్తి కావడానికి ప్రస్తుతం 30 సెకన్లు పడుతుండగా దానికి 15 సెకన్లకు తగ్గించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (National Payments Corporation) ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధన రేపటి నుంచి అమలులోకి రానుంది. అలాగే ట్రాన్జాక్షన్ స్టేటస్, ట్రాన్జాక్షన్ రివర్సల్, అడ్రస్ వ్యాలిడేషన్ సమయం కూడా 30 సెకన్ల నుంచి 10 సెకన్లకు తగ్గనుంది.