అక్షరటుడే, ఆర్మూర్ : Farmers | వానాకాలం సాగు పనులు ప్రారంభం అయ్యాయి. పలు గ్రామాల్లో వరి నాట్లు ఊపందుకుకున్నాయి. ఈ క్రమంలో రైతులు యూరియా (Urea), ఇతర ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. అయితే పలు చోట్ల యూరియా కొరత (Urea Shortage)తో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్ (Mupkal) మండలం రెంజర్ల గ్రామంలో శనివారం యూరియా కోసం రైతులు, మహిళలు భారీగా వచ్చారు. అయితే క్యూలైన్లో చెప్పులు పెట్టి యూరియా కోసం పడిగాపులు కాశారు. ఈ విషయంపై మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి (MLA Prahsnth Reddy) ఎక్స్ వేదికగా స్పందించారు. రేవంత్రెడ్డి పాలనలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. మార్పు అంటే ఇదేనా అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మళ్లీ రైతులకు గత కాంగ్రెస్ పాలనలోని పాత రోజులు వచ్చాయన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎరువుల కోసం రైతులు ఏనాడు ఇబ్బందులు పడలేదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.