అక్షరటుడే, వెబ్డెస్క్: Rythu Bharosa | రాష్ట్ర ప్రభుత్వం(State Government) వానాకాలం సీజన్కు సంబంధించి రైతు భరోసాను వేగంగా జమ చేస్తోంది. సీఎం రేవంత్రెడ్డి సోమవారం రైతు భరోసా జమ ప్రారంభించిన విషయం తెలిసిందే. అదే రోజు రెండు ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రైతు భరోసా(Rythu Bharosa) జమ చేసింది. అనంతరం మూడు, నాలుగు ఎకరాల్లోపు రైతులకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా.. గురువారం ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న వారికి రైతు భరోసా జమ చేసింది.
ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల కోసం రూ.1,189 కోట్లు విడుదల చేసింది. దీంతో అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. ఈ సీజన్లో ఎకరాలతో సంబంధం లేకుండా అందరు రైతులకు డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల అకౌంట్లలో వేస్తామని తెలిపింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు రూ.6,404 కోట్లు అన్నదాతల ఖాతాల్లో జమయ్యాయి.
Rythu Bharosa | గత సీజన్లో మొండిచెయ్యి
యాసంగి సీజన్లో నాలుగు ఎకరాలలోపు భూమి ఉన్నవారికి మాత్రమే రైతు భరోసా జమ అయింది. నాలుగు ఎకరాలకు మించి భూమి ఉన్న వారికి డబ్బులు పడలేవు. దీంతో ఈ సారి కూడా తమకు డబ్బులు వస్తాయో రావో అని రైతులు(Farmers) ఆందోళన చెందారు. తాజాగా ప్రభుత్వం నాలుగు నుంచి ఐదు ఎకరాల భూమి ఉన్న రైతులకు రైతు భరోసా జమ చేయడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్కు సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేయాలని కోరుతున్నారు.