More
    HomeతెలంగాణRythu Bharosa | ఐదు ఎకరాల వరకు రైతు భరోసా జమ

    Rythu Bharosa | ఐదు ఎకరాల వరకు రైతు భరోసా జమ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rythu Bharosa | రాష్ట్ర ప్రభుత్వం(State Government) వానాకాలం సీజన్​కు సంబంధించి రైతు భరోసాను వేగంగా జమ చేస్తోంది. సీఎం రేవంత్​రెడ్డి సోమవారం రైతు భరోసా జమ ప్రారంభించిన విషయం తెలిసిందే. అదే రోజు రెండు ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రైతు భరోసా(Rythu Bharosa) జమ చేసింది. అనంతరం మూడు, నాలుగు ఎకరాల్లోపు రైతులకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా.. గురువారం ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న వారికి రైతు భరోసా జమ చేసింది.

    ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల కోసం రూ.1,189 కోట్లు విడుదల చేసింది. దీంతో అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. ఈ సీజన్​లో ఎకరాలతో సంబంధం లేకుండా అందరు రైతులకు డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల అకౌంట్లలో వేస్తామని తెలిపింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు రూ.6,404 కోట్లు అన్నదాతల ఖాతాల్లో జమయ్యాయి.

    READ ALSO  Armoor | ఆలయ ఆవరణలో స్వచ్ఛ కార్యక్రమం

    Rythu Bharosa | గత సీజన్​లో మొండిచెయ్యి

    యాసంగి సీజన్​లో నాలుగు ఎకరాలలోపు భూమి ఉన్నవారికి మాత్రమే రైతు భరోసా జమ అయింది. నాలుగు ఎకరాలకు మించి భూమి ఉన్న వారికి డబ్బులు పడలేవు. దీంతో ఈ సారి కూడా తమకు డబ్బులు వస్తాయో రావో అని రైతులు(Farmers) ఆందోళన చెందారు. తాజాగా ప్రభుత్వం నాలుగు నుంచి ఐదు ఎకరాల భూమి ఉన్న రైతులకు రైతు భరోసా జమ చేయడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్​కు సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేయాలని కోరుతున్నారు.

    Latest articles

    lawcet 2025 | లాసెట్​లో ర్యాంక్​ సాధించిన ఎమ్మెల్యే

    అక్షరటుడే, వెబ్​డెస్క్: lawcet 2025 | ఎమ్మెల్యే(MLA)గా గెలిచిన వారికి తీరిక ఉండదు. నిత్యం ప్రజలు, కార్యకర్తలతో సమావేశాలు.....

    Bodhan | బంజార సేవాసంఘం కమిటీ ఎన్నిక

    అక్షరటుడే, బోధన్‌: Bodhan | బంజార సంఘం బోధన్‌ పట్టణ, మండల నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు. మండలంలోని...

    CM Revanth | మెట్రో రెండో దశకు అనుమతి ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరిన సీఎం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Revanth | హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-II (Hyderabad Metro Phase-2) కు స‌త్వ‌ర‌మే అనుమ‌తులు...

    Tirumala | శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Tirumala | తిరుమల (Tirumala)లో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి నిత్యం వేలాది...

    More like this

    lawcet 2025 | లాసెట్​లో ర్యాంక్​ సాధించిన ఎమ్మెల్యే

    అక్షరటుడే, వెబ్​డెస్క్: lawcet 2025 | ఎమ్మెల్యే(MLA)గా గెలిచిన వారికి తీరిక ఉండదు. నిత్యం ప్రజలు, కార్యకర్తలతో సమావేశాలు.....

    Bodhan | బంజార సేవాసంఘం కమిటీ ఎన్నిక

    అక్షరటుడే, బోధన్‌: Bodhan | బంజార సంఘం బోధన్‌ పట్టణ, మండల నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు. మండలంలోని...

    CM Revanth | మెట్రో రెండో దశకు అనుమతి ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరిన సీఎం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Revanth | హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-II (Hyderabad Metro Phase-2) కు స‌త్వ‌ర‌మే అనుమ‌తులు...