అక్షరటుడే, కామారెడ్డి: Raithu Barosa | రైతులు ఎదురు చూస్తున్న రైతు భరోసాను ప్రభుత్వం విడుదల చేసింది. మంగళవారం రైతుల ఖాతాల్లో నిధులను జమచేసింది. జిల్లాలో 2,47,908 మంది రైతుల ఖాతాల్లో రూ.169.48 కోట్లు రైతు భరోసా నిధులు జమ చేయడం జరిగిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
బాన్సువాడ (Banswada) నియోజకవర్గంలో 27,537 మంది రైతులకు రూ. 17.36 కోట్లు, జుక్కల్ (Jukkal) నియోజకవర్గంలో 73,230 మంది రైతులకు రూ. 53.02 కోట్లు, ఎల్లారెడ్డి (Yellareddy) నియోజకవర్గంలో 87,777 మంది రైతులకు రూ. 59 కోట్లు, కామారెడ్డి నియోజకవర్గంలో 59,364 మంది రైతులకు రూ. 40.07 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు.