More
    HomeతెలంగాణRythu Bharosa | ఆ జిల్లా రైతులకు పడని రైతు భరోసా.. ఎందుకో తెలుసా?

    Rythu Bharosa | ఆ జిల్లా రైతులకు పడని రైతు భరోసా.. ఎందుకో తెలుసా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rythu Bharosa | రాష్ట్ర ప్రభుత్వం ఎన్నాడు లేనివిధంగా ఈ వానాకాలం సీజన్​కు సంబంధించి రైతు భరోసా (Rythu Bharosa)ను వేగంగా రైతుల (Farmers) ఖాతాల్లో జమ చేసింది.

    ఇప్పటివరకు రూ.9 వేల కోట్లను తొమ్మిది రోజుల్లో అన్నదాతలకు అందజేసింది. ఎకరాలతో సంబంధం లేకుండా అందరు రైతులకు పెట్టుబడి సాయం అందించింది. అయితే రంగారెడ్డి (Rangareddy) జిల్లాలోని పలువురు రైతులకు మాత్రం మొండిచేయ్యి చూపింది. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు రైతుభరోసా జమ చేయాలని కోరుతున్నారు. రైతులకు మద్దతుగా బీఆర్​ఎస్ (BRS) ఆందోళనకు సిద్ధం అవుతోంది.

    రంగారెడ్డి జిల్లాలోని ఔటర్​ రింగ్​ రోడ్డు (ORR) లోపల గల మండలాలకు ప్రభుత్వం రైతు భరోసా జమ చేయలేదు. బాలాపూర్, అబ్దుల్లాపూర్, రాజేందర్‌నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, హయత్‌నగర్‌‌తో పాటుగా మరి కొన్ని మండలాల్లోని రైతులకు ప్రభుత్వం రైతు భరోసా రద్దు చేసింది. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు.

    READ ALSO  Kondapur Flyover | కొండాపూర్​ ఫ్లైఓవర్​కు పీజేఆర్​ పేరు.. త్వరలో ప్రారంభం

    Rythu Bharosa | కూరగాయల సాగు

    ఓఆర్​ఆర్​ లోపల గల మండలాల రైతులు ఎక్కువగా ఆకు కూరలు, కూరగాయలు సాగు చేస్తారు. అయితే తమకు రైతు భరోసా జమ కాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. కూరగాయల సాగు వ్యవసాయం కిందకు రాదా? అని ప్రశ్నిస్తున్నారు. తమకు పెట్టుబడి ఉండదా అంటున్నారు. రైతు భరోసా జమ చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.

    Rythu Bharosa | రేపటిలోగా జమ చేయాలి

    ఓఆర్​ఆర్​ లోపల గల రైతులకు బుధవారం సాయంత్రంలోగా రైతు భరోసా జమ చేయాలని బీఆర్​ఎస్​ నాయకుడు పట్లోళ్ల కార్తీక్​రెడ్డి (Patlolla Karthik Reddy ) డిమాండ్​ చేశారు. లేదంటే నిరాహార దీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా రాష్టానికి ఆర్థిక వెన్నెముక అన్నారు. జిల్లా రైతుల ఎన్నో త్యాగాల చేయటంతో రాష్టానికి ఆర్థిక వనరులు సమకూరాయని ఆయన పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అవమానించిందన్నారు.

    READ ALSO  Local Body Elections | స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు.. అప్పటిలోగా ఎలక్షన్లు నిర్వహించాలని ఆదేశాలు

    Rythu Bharosa | మంత్రి కీలక ప్రకటన

    ఔటర్​ రింగ్​ రోడ్డు లోపల సాగు చేయని భూములు అధికంగా ఉండటతో రైతు భరోసా నిలిపి వేసినట్లు ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Tummala Nageshwara rao) తెలిపారు. ఔటర్​ లోపల ఉన్న 2.13 లక్షల ఎకరాల భూముల్లో 93 వేల ఎకరాల వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లు, సాగుకు అనువైనవి కాని భూములుగా గుర్తించామన్నారు. పంటలు సాగు చేస్తున్న 1.20 లక్షల ఎకరాలకు రెండు మూడు రోజుల్లో రైతు భరోసా జమ చేస్తామని ఆయన తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని, ఈ విషయాన్ని బీఆర్​ఎస్​ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటోందని విమర్శించారు.

    Latest articles

    Rain Alert | రాష్ట్రానికి వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షం (Rain) పడే అవకాశం...

    Indian Brands | ఎంసీ ఫస్ట్‌.. రాయ‌ల్ స్ట‌గ్ సెకండ్‌.. ప్ర‌పంచ మ‌ద్యం విక్ర‌యాల్లో భార‌త బ్రాండ్ల హ‌వా

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Brands : భార‌తీయ విస్కీ బ్రాండ్లు ప్ర‌పంచ మార్కెట్ల‌ను శాసిస్తున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధికంగా...

    Puri Jagannath | భక్తుల కోసం మూలవిరాట్టే కదిలొచ్చే.. పూరి జగన్నాథ రథయాత్ర విశేషలివే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath : ఆషాఢ శుద్ధ విదియ(Ashadha Shuddha Vidiya)నాడు పూరీ క్షేత్రంలో అంగరంగ వైభవంగా...

    Today Gold Price | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. తులం బంగారం ధ‌ర ఎంత అంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold ధ‌ర‌లు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు త‌గ్గుతాయో చెప్ప‌లేని...

    More like this

    Rain Alert | రాష్ట్రానికి వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షం (Rain) పడే అవకాశం...

    Indian Brands | ఎంసీ ఫస్ట్‌.. రాయ‌ల్ స్ట‌గ్ సెకండ్‌.. ప్ర‌పంచ మ‌ద్యం విక్ర‌యాల్లో భార‌త బ్రాండ్ల హ‌వా

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Brands : భార‌తీయ విస్కీ బ్రాండ్లు ప్ర‌పంచ మార్కెట్ల‌ను శాసిస్తున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధికంగా...

    Puri Jagannath | భక్తుల కోసం మూలవిరాట్టే కదిలొచ్చే.. పూరి జగన్నాథ రథయాత్ర విశేషలివే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath : ఆషాఢ శుద్ధ విదియ(Ashadha Shuddha Vidiya)నాడు పూరీ క్షేత్రంలో అంగరంగ వైభవంగా...