అక్షరటుడే, బాన్సువాడ : Birkoor | గేదెలను కడగడానికి వెళ్లిన పాడి రైతు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. బీర్కూరు మండలం అన్నారం గ్రామానికి Annaram village చెందిన పాడి రైతు farmer సాయిబాబా శుక్రవారం సాయంత్రం గేదెలు కడగడానికి కుంటలోకి తీసుకెళ్లాడు. గేదెలను శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కుంటలో పడి మునిగిపోయాడు. స్థానికులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం మృతదేహం లభ్యమైంది. పోలీసులు Police ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.