అక్షరటుడే, ఇందూరు: Raithu Barosa | రైతు భరోసా పథకం కింద ఇప్పటివరకు జిల్లాలోని 2,38,247 మంది రైతుల ఖాతాల్లో 214.56 కోట్ల నిధులు జమ చేసినట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తెలిపారు. వానాకాలం సీజన్కు సంబంధించి పంట పెట్టుబడి సాయం కింద మొత్తం 2,98,472 మంది రైతులకు రూ.326.03 కోట్ల నిధులను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ నెల 16న రెండు ఎకరాలలోపు వ్యవసాయ భూమి కలిగిన వారికి ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.95.66 కోట్లు, 17వ తేదీన మూడెకరాల వరకు సాగు భూమి ఉన్నవారికి రూ.65.06 కోట్లు, 18, 19వ తేదీల్లో ఐదెకరాల లోపు సాగు భూమి కలిగిన వారికి రూ.53.84 కోట్ల నిధులు జమ చేసినట్లు వివరించారు. అలాగే కొత్త పాస్ బుక్కులు వచ్చినవారు వ్యవసాయ విస్తీర్ణాధికారులను కలిసి సరైన పత్రాలను సమర్పించాలని సూచించారు. వాడుకలో ఉన్న బ్యాంకు అకౌంట్ నెంబర్లను అందించాలని తెలిపారు.