అక్షరటుడే, వెబ్డెస్క్: Fake Visa | నకిలీ వీసా(Fake Visa)లతో విదేశాలకు పంపుతున్న ముఠా గుట్టు రట్టయ్యింది. ఇద్దరు ముఠా సభ్యులను శంషాబాద్ పోలీసులు(Shamshabad Police) అరెస్టు చేశారు. శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్(ACP Srikanth Goud) తెలిపిన వివరాల ప్రకారం.. నకిలీ పాస్పోర్ట్, వీసాలతో 8 మంది శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి విదేశాలకు వెళ్తున్నారన్న సమాచారం రావడంతో లాండ్ ఆర్డర్, ఎస్వోటీ పోలీసులు(SOT Police) దాడులు చేశారు. అనంతరం ముఠాలోని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సత్యనారాయణ, బాలరాజు, అన్నమయ్య జిల్లాకు చెందిన సుంకర శివకుమార్, కడప జిల్లాకు చెందిన గోపాల్, హైదరాబాద్కు చెందిన అంజి ముఠాగా ఏర్పడి నకిలీ వీసాలు తయారు చేస్తున్నారు. అమాయక ప్రజలను టార్గెట్ చేసి వారి వద్ద రూ. లక్షల్లో వసూలు చేసి విదేశాలకు పంపుతున్నారని తెలిపారు.
ఇదే విధంగా శంషాబాద్ విమానాశ్రయం(Shamshabad Airport) నుంచి బుధవారం 8 మందిని మస్కట్ పంపిస్తుండగా దాడులు చేసి.. నకిలీ వీసా ముఠాలోని బాలరాజు, శివకుమార్ను అరెస్టు చేశారు. కేసులో ఉన్న మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు చెప్పారు. ముఠా వద్ద నుంచి 14 పాస్పోర్టులు, 14 వీసాలు, 16 విమాన టికెట్లు, 7 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకొని రిమాండ్ తరలించామని తెలిపారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.