అక్షరటుడే, ఇందూరు:Wellness Center | నిజామాబాద్(Nizamabad)లోని వెల్నెస్ సెంటర్లో తగిన సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు(Collector Rajiv Gandhi Hanumanthu) అధికారులను ఆదేశించారు. నుడా ఛైర్మన్ కేశవేణు, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్తో కలిసి శనివారం సౌకర్యాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వెల్నెస్ సెంటర్(Wellness Center)కు వచ్చే వారి కోసం వెయిటింగ్ హాల్తో పాటు ఇతర సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని తెలిపారు.
రిటైర్డ్ ఉద్యోగులతో పాటు పాత్రికేయులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం రిటైర్డ్ ఉద్యోగుల(Retired Employees) సంఘం భవనాన్ని సందర్శించారు. సమావేశం హాల్, పార్కింగ్ కోసం స్థలం కేటాయించాలని సంఘం ప్రతినిధులు కోరగా.. కలెక్టర్(Collector nizamabad) సానుకూలంగా స్పందించారు. ఇన్ఛార్జి ఆర్డీవో స్రవంతి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు రవీందర్ రావు, భూమాగౌడ్, రామ్మోహన్ రావు తదితరులు పాల్గన్నారు.