అక్షరటుడే, వెబ్డెస్క్ : BJP | బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (mla rajasingh) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనే వార్తలపై ఆయన స్పందించారు. బీజేపీ (bjp)లో కొంతకాలంగా నిరసన గళం వినిపిస్తున్న గోషామహల్(Goshamahal) ఎమ్మెల్యే రాజాసింగ్పై ఆ పార్టీ పెద్దలు చర్యలకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వచ్చాయి.
క్రమ శిక్షణ కమిటీ ఆయనకు నోటీసులు ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై ఆయన స్పందిస్తూ తనకు నోటీసులు ఇవ్వొద్దని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. అటు ఇటు కానివాళ్లతో పార్టీని బలోపేతం చేయలేం అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారితో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేం అని పేర్కొన్నారు. ఒకవేళ తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే.. ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగిందో వివరాలు బయట పెడతానన్నారు. అందరి జాతకాలు బయట పెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఆయన వ్యాఖ్యలపై పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
