అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | బలిదాన్ దివస్ (Balidan Diwas) కార్యక్రమంలో భాగంగా పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిఒక్కరూ అమ్మ పేరు మీద ఒక మొక్కను నాటాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana) పిలుపునిచ్చారు. బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ (Shyama Prasad Mukherjee) బలిదాన్ దివస్ సందర్భంగా దుబ్బ చౌరస్తాలో మంగళవారం మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ సమగ్రత, ఐక్యత, భారతీయ సాంప్రదాయాలను పెంపొందించడం ద్వారా జాతీయ పునర్నిర్మాణం జరుగుతుందనే లక్ష్యంతో బీజేఎస్ను(BJS) శ్యామాప్రసాద్ స్థాపించారని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ.. ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా 370 ఆర్టికల్ను (Article 370) రద్దుచేసి కశ్మీర్ను సుందరీకరణ చేశారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పంచరెడ్డి ప్రవళిక, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, దుబ్బ మండల అధ్యక్షుడు రాజు, కొండ ఆశన్న, మాజీ కార్పొరేటర్ మాస్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.