అక్షరటుడే, వెబ్డెస్క్ : Ceasefire | పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ప్రతిఘటన తీవ్రస్థాయిలో ఉండాలని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది బలగాలకు ఆదేశాలు జారీ చేశారు. ఇది వరకు మోదీ సైతం పాక్ బుల్లెట్లు కాలిస్తే క్షిపణులతో దాడులు చేయాలని సైన్యాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కమాండర్లకు పూర్తి అధికారులు ఇచ్చారు. పాకిస్తాన్ నుంచి దాడులు జరిగితే దాడులు తీవ్రంగా ఉండాలని పశ్చిమ ప్రాంతంలోని అన్ని ఆర్మీ కమాండర్లకు ఆర్మీ చీఫ్ పూర్తి అధికారాలు కట్టబెట్టారు.
Ceasefire | పాక్ ఎయిర్బేస్లు ధ్వంసం
ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్ నిత్యం భారత్పై దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఎల్వోసీ వెంబడి కాల్పులకు తెగబడటంతో పాటు, డ్రోన్లు, యుద్ధ విమానాలతో భారత్పై దాడికి యత్నించింది. అయితే పాక్ దాడులను భారత బలగాలు తిప్పికొట్టాయి. దాయది దేశం ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లను మన గగనతల రక్షణ వ్యవస్థ మధ్యలోనే కూల్చి వేసింది. పాక్ దాడులకు ప్రతీకారంగా భారత్ యుద్ధ విమానాలు, క్షిపణులతో పాకిస్తాన్లోని ఎయిర్బేస్లు, మిలటరి స్థావరాలపై దాడులు చేసింది. ఈ క్రమంలో శనివారం రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.
Ceasefire | ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్
కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చిన కొద్ది గంటల్లోనే పాక్ తన వక్రబుద్ధి బయటపెట్టింది. శనివారం రాత్రి డ్రోన్లతో మళ్లీ భారత్పై దాడికి యత్నించింది. ఈ దాడులను భారత్ ఆర్మీ తిప్పికొట్టింది. ఈ క్రమంలో ఆర్మీ చీఫ్ బలగాలకు కీలక అధికారులు ఇచ్చారు. పాక్ మళ్లీ ఒప్పందాన్ని ఉల్లంఘించి దాడులకు పాల్పడితే తీవ్రస్థాయిలో ప్రతిదాడులు చేయాలని ఆదేశించారు. మరోవైపు సోమవారం మధ్యాహ్నం ఇరుదేశాల ఆర్మీ జనరల్స్ సమావేశం జరగనుంది.