అక్షరటుడే, కామారెడ్డి: Farmer | ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 10 వరకు బోర్లు వేయించాడు ఓ యువరైతు. ఒక్క బోరులో కూడా చుక్క నీరు పడలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటన దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. దోమకొండ ఎస్సై స్రవంతి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పంతులు గారి పెంటయ్య(26)కు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయ భూమిలో పంట వేసుకోవడానికి సరిపడా నీళ్లు లేకపోవడంతో వరుసగా 10 వరకు బోర్లు వేశాడు. అయినా నీళ్లు పడలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం తెల్లవారుజామున తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి మనెవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.