అక్షరటుడే, వెబ్డెస్క్:Encounter | వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు(Maoists) కుదేలు అవుతున్నారు. నిత్యం ఎన్కౌంటర్లలో భారీ సంఖ్యలో మావోలు మృతి చెందుతున్నారు.
తాజాగా వారికి మరో షాక్ తగిలింది. జార్కండ్లో శనివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సల్స్ మృతి చెందారు. జార్కండ్లోని ఇచాబార్ అడవి(Jharkhand Ichabar forest)లో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో పలువురు మావోలు మృతి చెందారు. మృతి చెందిన మావోయిస్టుల్లో జార్ఖండ్ జన్ ముక్తీ పరిషత్ కీలక నేత పప్పు ఉన్నట్లు సమాచారం. పప్పు లోహరాపై రూ.10 లక్షల రివార్డు ఉంది.
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారి నుంచి బలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా జార్కండ్(Jharkhand)లో ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం గమనార్హం. దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో బలగాలు నిత్యం కూంబింగ్(Coombing) చేపడుతూ.. మావోల పని పడుతున్నాయి. ఆపరేషన్ కగార్ పేరుతో పెద్దఎత్తున కూంబింగ్ చేపట్టి పలువురు మావోలను అంతం చేసింది.