అక్షరటుడే, వెబ్డెస్క్: Encounter | ఛత్తీస్గఢ్(Chhattisgarh)లో మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. నారాయణపూర్ జిల్లా(Narayanpur district)లో పోలీసులు, మావోయిస్టల మధ్య గురువారం తెల్లవారుజామున ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో భద్రతా బలగాలు(Security forces) ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) ఇటీవల మాట్లాడుతూ.. మావోయిస్టులకు నిద్ర లేకుండా చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతి వానాకాలంలో వాతావరణ పరిస్థితులను అనుకూలంగా మలుచుకొని మావోలు రెస్ట్ తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వానాకాలంలో వారికి నిద్ర లేకుండా చేస్తామని ప్రకటించారు. 2026 మార్చి 31 వరకు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆయుధాలు వీడి లొంగిపోవడం తప్ప మావోలకు మరో అవకాశం లేదని ఆయన పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో బలగాలు నారాయణపూర్ జిల్లాలో కూంబింగ్(Coombing) చేపడుతుండగా ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. దీంతో ఇద్దరు మాహిళా మావోయిస్టులు మృతి చెందారు.
Encounter | ఆపరేషన్ కగార్తో కకావికలం
కేంద్ర ప్రభుత్వం(Central Government) చేపట్టిన ఆపరేషన్ కగార్తో మావోయిస్టులు కకావికలం అవుతున్నారు. వేల సంఖ్యలో బలగాలు అడువులను చుట్టు ముడుతుండడంతో మావోయిస్టులు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు తమకు కంచుకోటగా ఉన్న అడవుల్లోకి సైతం బలగాలు చొచ్చుకువెళ్తున్నాయి. దండకారణ్యంలో సైతం జల్లెడ పడుతుండటంతో మావోలు తమ స్థావరాలను నిత్యం మార్చుకుంటున్నారు. అయినా బలగాల కంటపడి ఎన్కౌంటర్లలో మృతి చెందుతున్నారు. మరోవైపు ఎన్కౌంటర్లలో కీలక నేతలు మృతి చెందుతుండడం మావోలను కలవర పెడుతుంది. ఈ క్రమంలోనే తాము శాంతి చర్చలకు సిద్ధమని వారు గతంలో ప్రకటించారు. ఆపరేషన్ కగార్(Operation Kagar) ఆపాలని డిమాండ్ చేశారు. అయితే కేంద్ర మాత్రం చర్చలకు తావు లేదని స్పష్టం చేసింది. ఆయుధాలు వీడి లొంగిపోవాలని మావోయిస్టులకు సూచించింది.