అక్షరటుడే, వెబ్డెస్క్: Encounter | ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లాలో (Bijapur district) నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో సోమవారం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో మావోయిస్టు నేత సోది కన్నా (Maoist leader Sodi Kanna) మృతి చెందాడు. 303 రైఫిల్, భారీగా మందుగుండు సామగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
Encounter | మావోయిస్టుల స్నైపర్
సోది కన్నా నక్సలైట్ స్నిపర్గా బలగాలు పేర్కొన్నాయి. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) బెటాలియన్ నంబర్ 01లోని కంపెనీ నంబర్ 02 డిప్యూటీ కమాండర్ అయిన ఆయనపై రూ.8 లక్షల రివార్డు ఉంది. సీనియర్ నాయకుడు మద్వి హిడ్మాకు సన్నిహితుడైన ఆయన పలు దాడుల్లో కీలక పాత్ర పోషించాడు.
ఈ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు డీఆర్జీ బీజాపూర్, డీఆర్జీ దంతెవాడ, STF, కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాలు (Cobra and CRPF forces) సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో కీలక నేత సోది కన్నా మృతి చెందడం గమనార్హం.
Encounter | వరుస ఎన్కౌంటర్లు
ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టుల అంతమే లక్ష్యంగా భద్రతా బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో వరుస ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటుండగా.. భారీగా మావోయిస్టులు మృతి చెందుతున్నారు. రెండు రోజుల క్రితం బీజాపూర్ జిల్లాలో ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.
Encounter | కీలక నేతలు హతం
ఆపరేషన్ కగార్లో (Operation Kagar) భాగంగా ఇటీవల జరుగుతున్న ఎన్కౌంటర్లలో కీలక నేతలు హతం అవుతుండటం మావోయిస్టులను కలవర పెడుతోంది. గత నెలలో జరిగిన ఎన్కౌంటర్లలో నంబాల కేశవరావు, సుధాకర్, భాస్కర్ లాంటి కీలక నేతలు ఇటీవల మరణించారు. మరోవైపు భారీగా కేడర్ను కోల్పోతుండటంతో నక్సల్స్ ఆందోళన చెందుతున్నారు. నిత్యం ఎన్కౌంటర్లు జరుగుతుండటంతో పలువురు ఆయుధాలు వీడి పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. కొత్తగా రిక్రూట్మెంట్లు లేక మావోయిస్టులు రోజురోజుకు బలహీనం అవుతున్నారు.