అక్షరటుడే, వెబ్డెస్క్ : Encounter | ఆంధ్ర ఒడిశా బోర్డర్లో AOB ఏపీలోని అల్లూరి alluri జిల్లాలో బుధవారం భారీ ఎన్కౌంటర్ encounter జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
జీకే వీధి ఏజెన్సీలో gk street agency కూంబింగ్ చేపడుతుండగా ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఇందులో మావోయిస్టు కీలక నేత జగన్ అలియాస్ పండన్న ఉన్నాడు. ఆయనపై రూ.20 లక్షల రివార్డ్ ఉంది. మరో ఇద్దరు మావోయిస్టులు సంకు నాచికా, రమేష్ మృతి చెందినట్లు తెలిసింది. వారి నుంచి పోలీసులు ఏకే –47 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతంలో మావోల కోసం బలగాలు ఇంకా కూంబింగ్ coombing చేపడుతున్నాయి.