అక్షరటుడే, వెబ్డెస్క్: Union Cabinet | దేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యానికి చీకటి యుగమని కేంద్ర మంత్రిమండలి (Union Cabinet) అభివర్ణించింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi) దేశంలో విధించిన ఎమర్జెన్సీని ఖండిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. అత్యయిక స్థితి సమయంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్న క్రమంలో మృతి చెందిన వారికి నివాళులు అర్పించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో.. అణచివేత పాలనను, భారత రాజ్యాంగ (Indian Constitution) సారాన్ని అణచివేసే ప్రయత్నాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న లెక్కలేనన్ని పౌరులకు మంత్రివర్గం నివాళులర్పించింది. ఈ చారిత్రక మైలురాయిని స్మరించుకుంటూ, అనేక ప్రభావవంతమైన అభివృద్ధి కార్యక్రమాలను కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఈ సమావేశంలో తీసుకున్న మూడు ముఖ్యమైన నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ (Union Minister Ashwini Vaishnav) విలేకరులకు వెల్లడించారు.
Union Cabinet | పుణె మెట్రోకు ఆమోదం..
పుణెలో మెట్రో నెట్వర్క్ (Pune metro network)ను పెంచడానికి రూ. 3,626 కోట్ల కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే, జార్ఖండ్లోని ఝరియాలో భూగర్భ బొగ్గు గనుల నిర్వాసితుల పునరావాసం కోసం, ప్రభావిత వర్గాలకు ఉపశమనం కలిగించడానికి రూ. 5,940 కోట్లు కేటాయించింది. అలాగే, ఆగ్రాలో అంతర్జాతీయ బంగాళాదుంప కేంద్రం (International Potato Center) స్థాపనకు కేబినెట్ రూ. 111 కోట్లతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది దేశవ్యాప్తంగా బంగాళాదుంప సాగులో ఆవిష్కరణలు, ఉత్పాదకతను పెంచుతుందని భావిస్తున్నారు.
Union Cabinet | స్వేచ్ఛ, హక్కులపై దాడి
ఎమర్జెన్సీ విధించడం ద్వారా భారత చరిత్రలో రాజ్యాంగాన్ని తారుమారు చేయడం, ప్రజాస్వామ్య స్ఫూర్తిపై దాడి చేశారని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) అన్నారు. ప్రాథమిక హక్కులు, మానవ స్వేచ్ఛ, గౌరవాన్ని తుంగలో తొక్కడం చరిత్రలో మరపురాని అధ్యాయమని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్బంగా భారత రాజ్యాంగం. దేశ ప్రజాస్వామ్య నీతిపై భారత ప్రజలు దృఢ విశ్వాసం కొనసాగిస్తున్నారని కేంద్ర మంత్రివర్గం (Union Cabinet) పునరుద్ఘాటించిందని వైష్ణవ్ తెలిపారు. “నియంతృత్వ ధోరణులను ప్రతిఘటించి, మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య నిర్మాణాన్ని రక్షించడానికి దృఢంగా నిలిచిన వారి నుంచి ప్రేరణ పొందడం వృద్ధులకు ఎంత ముఖ్యమో, యువతకు అంతే ముఖ్యం” అని మంత్రి పేర్కొన్నారు.