More
    HomeజాతీయంPM Modi | భారత చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం : ప్రధాని మోదీ

    PM Modi | భారత చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం : ప్రధాని మోదీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ :PM Modi | భారత దేశ చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) అన్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి బుధవారంతో 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆయన స్పందించారు. 1975 జూన్​ 25న నాటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. 21 నెలల పాటు దేశంలో ఎమెర్జెన్సీ(Emergency) కొనసాగింది. 1977 మార్చి 21న ఆమె అత్యవసర పరిస్థితిని రద్దు చేశారు.

    PM Modi | ఆ రోజులను భారతీయులు మరచిపోరు

    దేశంలో ఎమర్జెన్సీపై ప్రధాని స్పందించారు. భారత చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం అన్నారు. ఈరోజును సంవిధాన్‌ హత్య దివస్‌(Samvidhan Murder Day)గా భారత ప్రజలు జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని అరెస్ట్‌ చేసిందన్నారు. అత్యవసర పరిస్థితిని ఏ భారతీయుడు మరచిపోడని ఆయన పేర్కొన్నారు.

    READ ALSO  Yoga Day | ఎల్​బీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైన యోగా డే కౌంట్​డౌన్​

    PM Modi | వారికి సెల్యూట్​

    ఎమర్జెన్సీ(Emergency)కి వ్యతిరేకంగా పోరాడిన వారికి ప్రధాని మోదీ సెల్యూట్​ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించేందుకు..అన్ని రంగాల వారు పోరాటం చేశారన్నారు. వారి పోరాటం వల్లే ఎమర్జెన్సీని ఎత్తేశారని మోదీ గుర్తు చేశారు. రాజ్యాంగంలోని సూత్రాలను బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వికసిత్‌ భారత్‌ సాధించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పేదలు, అణగారిన వర్గాల కలలను సాకారం చేస్తామని హామీ ఇచ్చారు.

    PM Modi | కాంగ్రెస్​ మోసాలకు గుర్తు

    ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్​ రాజ్యాంగం(Congress Constitution)లో పొందుపరచబడిన విలువలను పక్కన పెట్టిందని మోదీ అన్నారు.42వ సవరణ కాంగ్రెస్ మోసాలకు ప్రధాన ఉదాహరణ అని ప్రధాని మోదీ అన్నారు. ఎమర్జెన్సీలో రాజ్యాంగంలో పొందుపరచబడిన విలువలను పక్కన పెట్టారని, ప్రాథమిక హక్కులు నిలిపి వేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛను తుడిచిపెట్టి, అనేక మంది రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులను జైలులో పెట్టారన్నారు.

    READ ALSO  PM Modi | ఇరాన్ అధ్య‌క్షుడికి మోదీ ఫోన్‌.. తాజా ఉద్రిక్త‌త‌ల‌పై ఆందోళ‌న‌

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 27 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – శుక్రవారంమాసం – ఆషాఢపక్షం...

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...

    Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని...

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 27 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – శుక్రవారంమాసం – ఆషాఢపక్షం...

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...