More
    HomeజాతీయంPM Modi | భారత చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం : ప్రధాని మోదీ

    PM Modi | భారత చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం : ప్రధాని మోదీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ :PM Modi | భారత దేశ చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) అన్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి బుధవారంతో 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆయన స్పందించారు. 1975 జూన్​ 25న నాటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. 21 నెలల పాటు దేశంలో ఎమెర్జెన్సీ(Emergency) కొనసాగింది. 1977 మార్చి 21న ఆమె అత్యవసర పరిస్థితిని రద్దు చేశారు.

    PM Modi | ఆ రోజులను భారతీయులు మరచిపోరు

    దేశంలో ఎమర్జెన్సీపై ప్రధాని స్పందించారు. భారత చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం అన్నారు. ఈరోజును సంవిధాన్‌ హత్య దివస్‌(Samvidhan Murder Day)గా భారత ప్రజలు జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని అరెస్ట్‌ చేసిందన్నారు. అత్యవసర పరిస్థితిని ఏ భారతీయుడు మరచిపోడని ఆయన పేర్కొన్నారు.

    READ ALSO  Malaria Vaccine | మలేరియా వ్యాక్సిన్ ధర సగం తగ్గింపు.. సంచలన నిర్ణయం తీసుకున్న భారత్ బయోటెక్

    PM Modi | వారికి సెల్యూట్​

    ఎమర్జెన్సీ(Emergency)కి వ్యతిరేకంగా పోరాడిన వారికి ప్రధాని మోదీ సెల్యూట్​ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించేందుకు..అన్ని రంగాల వారు పోరాటం చేశారన్నారు. వారి పోరాటం వల్లే ఎమర్జెన్సీని ఎత్తేశారని మోదీ గుర్తు చేశారు. రాజ్యాంగంలోని సూత్రాలను బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వికసిత్‌ భారత్‌ సాధించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పేదలు, అణగారిన వర్గాల కలలను సాకారం చేస్తామని హామీ ఇచ్చారు.

    PM Modi | కాంగ్రెస్​ మోసాలకు గుర్తు

    ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్​ రాజ్యాంగం(Congress Constitution)లో పొందుపరచబడిన విలువలను పక్కన పెట్టిందని మోదీ అన్నారు.42వ సవరణ కాంగ్రెస్ మోసాలకు ప్రధాన ఉదాహరణ అని ప్రధాని మోదీ అన్నారు. ఎమర్జెన్సీలో రాజ్యాంగంలో పొందుపరచబడిన విలువలను పక్కన పెట్టారని, ప్రాథమిక హక్కులు నిలిపి వేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛను తుడిచిపెట్టి, అనేక మంది రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులను జైలులో పెట్టారన్నారు.

    READ ALSO  Shaktipeeth Expressway | రూ.20 వేల కోట్ల‌తో శ‌క్తిపీఠ్ ఎక్స్‌ప్రెస్ వే.. ఆమోదం తెలిపిన మ‌హారాష్ట్ర స‌ర్కారు

    Latest articles

    Jagga Reddy | సీఎం కుర్చీపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. నెక్స్ట్ సీఎం నేనే

    అక్షరటుడే, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ (TPCC working president), కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు...

    actress Meena | బీజేపీలోకి సినీ నటి మీనా!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : actress Meena | తమిళనాడు (Tamil Nadu)లో ఎలాగైనా బలపడాలని బీజేపీ (BJP) భావిస్తోంది....

    Swiss bank | భారీగా డబ్బు పోగేస్తున్న భారతీయులు.. స్విస్ బ్యాంకులోనే ఎందుకు దాస్తున్నారంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Swiss bank | నల్లధనం (black money) గురించి చర్చ వస్తే చాలు.. అందరికీ...

    Drug Awareness Rally | డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Drug Awareness Rally | డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని...

    More like this

    Jagga Reddy | సీఎం కుర్చీపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. నెక్స్ట్ సీఎం నేనే

    అక్షరటుడే, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ (TPCC working president), కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు...

    actress Meena | బీజేపీలోకి సినీ నటి మీనా!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : actress Meena | తమిళనాడు (Tamil Nadu)లో ఎలాగైనా బలపడాలని బీజేపీ (BJP) భావిస్తోంది....

    Swiss bank | భారీగా డబ్బు పోగేస్తున్న భారతీయులు.. స్విస్ బ్యాంకులోనే ఎందుకు దాస్తున్నారంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Swiss bank | నల్లధనం (black money) గురించి చర్చ వస్తే చాలు.. అందరికీ...