అక్షరటుడే, వెబ్డెస్క్: Israel | ఇరాన్– ఇజ్రాయెల్ (Iran – Israel) ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఈ క్రమంలో రెండు దేశాల గత మూడు రోజులుగా దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో ఇజ్రాయెల్లోని భారత పౌరులకు భారత ఎంబసీ (Indian Embassy) పలు సూచలను జారీ చేసింది.
ఇజ్రాయెల్లో ఉంటున్న భారతీయ పౌరులకు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత రాయబార కార్యాలయాలు ఈ హెచ్చరికను జారీ చేశాయి. పరిస్థితిని బట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించాయి.
అనవసర ప్రయాణాలు చేయొద్దని, సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని పేర్కొంది. ఇజ్రాయెల్ అధికారుల సూచలను పాటించాలని ఆదేశించింది. అప్రమత్తంగా ఉంటూ స్థానిక భద్రతా మార్గదర్శకాలను పాటించాలని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో భారత రాయబార కార్యాలయంతో సంప్రదించాలని సూచించింది. భారత రాయబార కార్యాలయంలో 24 గంటలు హెల్ప్లైన్ సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. +97254–7520711, +97254– 3278392 నంబర్లను సంప్రదించాలని కోరింది.