అక్షరటుడే, వెబ్డెస్క్: ACB Ride : మహబూబాబాద్ జిల్లా(Mahabubabad district)లో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. ఈ క్రమంలో విద్యుత్శాఖ ఎస్ఈ(Electricity Department SE) నరేష్ రూ.80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. గుత్తేదారు (contractor) నుంచి డబ్బులు తీసుకుంటుండగా తన ఇంట్లో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో నలుగురు అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. అయినా కొందరు అవినీతి అధికారుల్లో మార్పు రాకపోవడం గమనార్హం.