అక్షరటుడే, ఇందూరు: Nizamabad : నిజామాబాద్ నగరంలోని ఆరో ఠాణా పరిధిలో ఎనిమిది మంది జూదరులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. శాస్త్రీనగర్ లోని రైల్వే ట్రాక్ వద్ద పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో ఆదివారం రాత్రి తనిఖీలు చేపట్టారు. పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారి వద్ద నుంచి రూ.30 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమచారం. కాగా.. ఈ పేకాట స్థావరంలో గత కొద్ది రోజులుగా పెద్దఎత్తున జూదం నడుస్తున్నట్లు సమాచారం. పలువురు వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ పేకాట ఆడుతున్నట్లు తెలిసింది. అయితే పోలీసుల తనిఖీల్లో ఎవరు పట్టుబడ్డారో ఇంకా తెలియాల్సి ఉంది.
Nizamabad | ఎనిమిది మంది జూదరుల అరెస్టు

Nizamabad | ఎనిమిది మంది జూదరుల అరెస్టు