అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: AISF Kamareddy | విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యాలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాసంస్థలు ప్రారంభమై 15 రోజులు కావస్తున్నా సర్కారు బడుల్లో విద్యార్థులకు స్కూల్ డ్రెస్సులు అందజేయలేదన్నారు. అనేక పాఠశాలల్లో టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు.
చాలావరకు భవనాలు శిథిలావస్థలో ఉండడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువుతున్నారని వాపోయారు. వెంటనే విద్యార్థులకు అవసరమైనటువంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ కామారెడ్డి జిల్లా కన్వీనర్ పి శివప్రసాద్, ఎల్ సంపత్, సనత్, కుషాల్, రమేష్, శ్రీను పాల్గొన్నారు.