అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi) భర్త రాబర్ట్ వాద్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (Enforcement Directorate – ED) సమన్లు జారీ చేసింది. యూకే ఆయుధాల కన్సల్టెంట్ సంజయ్ భండారీ(UK arms consultant Sanjay Bhandari)కి సంబంధించిన కేసులో రాబర్ట్ వాగ్మూలాన్ని రికార్డ్ చేయడానికే ఈ సమన్లు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
Robert Vadra : జూన్ 17న విచారణ
సంజయ్ భండారీ అక్రమ నగదు చలామణి (మనీ లాండరింగ్) కేసులో తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడానికి జూన్ 17న ఈడీ ఎదుట రాబర్ట్ వాద్రా హాజరుకావాలని కోరినట్లు అధికారులు వెల్లడించారు.
Robert Vadra : అనారోగ్య సమస్యలు
జూన్ 10నే ఈడీ విచారణకు వాద్రా హాజరు కావాల్సి ఉంది. కానీ, 56 ఏళ్ల వాద్రా తనకు జూన్ 9న ఫ్లూ లాంటి లక్షణాలు ఉన్నాయని, ప్రొటోకాల్ ప్రకారం కొవిడ్ పరీక్ష చేయించుకున్నానని చెప్పి, విచారణకు డుమ్మా కొట్టారు.
అయితే, ఈడీ సమన్లను తప్పించుకునే ఉద్దేశం వాద్రాకు లేదని, ఈ నెల చివరలో తన విదేశీ ప్రయాణానికి ముందుగానీ, తర్వాత ఎప్పుడైనా ఈడీ ఎదుట హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నట్లు రాబర్ట్ తరఫు న్యాయవాది అప్పట్లో వివరణ ఇచ్చారు.
అయితే, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ (పీఎంఎల్ఏ) కింద వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడానికి, తర్వాత ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయడానికి వాద్రాకు ఈడీ తాజా సమన్లు జారీ చేసినట్లు చెబుతున్నారు.
Robert Vadra : మొత్తం 3 కేసులున్నాయ్!
మూడు మనీ లాండరింగ్ కేసుల్లో వాద్రాను ఈడీ విచారణ చేపడుతోంది.
- 2008లో హరియాణా(Haryana)లో జరిగిన ఓ భూ ఒప్పందంలో అక్రమాలు జరిగాయంటూ మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంగా వాద్రాను ఈడీ మూడు రోజులపాటు ప్రశ్నించింది.
- రాజస్థాన్(Rajasthan) బికనీర్(Bikaner)లో జరిగిన ఓ భూ ఒప్పందంలో ఆర్థిక అవకతవకలు జరిగాయనే ఆరోపణలున్నాయి. ఈ మనీలాండరింగ్ కేసులోనూ వాద్రాపై ఈడీ దర్యాప్తు చేపడుతోంది.
- ఢిల్లీ(Delhi)లో 2016లో సంజయ్ భండారీ(63)పై ఆదాయపు పన్ను శాఖ రైడింగ్ చేపట్టింది. ఈ ఘటన జరిగిన వెంటనే అతడు లండన్ పారిపోయాడు. అతడిని భారత్కు తిరిగి తీసుకొచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇటీవల బ్రిటన్ సుప్రీంకోర్టులో భారత్ ప్రభుత్వం అప్పీల్ చేసింది. కానీ, దానిని యూకే కోర్టు తిరస్కరించింది. దీంతో భండారీని మన దేశానికి తీసుకొచ్చే అవకాశాలు లేకుండా పోయాయి.
2009లో లండన్(London)లో 12, బ్రయాన్స్టన్ స్క్వేర్ ఇంటిని భండారీ కొనుగోలు చేశాడు. దానిని రెనోవేషన్ చేయమని కోరుతూ వాద్రా డబ్బులు ఇచ్చినట్లు ఈడీ 2023లో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే, తనకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా గానీ లండన్లో ఎలాంటి ఆస్తులు లేవని రాబర్ట్ వాదిస్తున్నారు. ‘రాజకీయ కక్ష’లతోనే తనపై ఈడీ కేసులు పెట్టి ‘వెంటాడి, వేధిస్తున్నారు’ అని పేర్కొంటున్నారు.