అక్షరటుడే వెబ్డెస్క్: ED Raids | కర్ణాకటలో జరిగిన వాల్మీకి కుంభకోణం(Valmiki Scam) దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది. వాల్మీకి కుంభకోణంతో సంబంధం ఉన్న బళ్లారి కాంగ్రెస్ ఎంపీ తుకారాం(Ballary Congress MP Tukaram)తోపాటు ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లపై బుధవారం దాడులు చేసింది.
ED Raids | మూడు ప్రాంతాల్లో తనిఖీలు
కర్ణాటకలో జరిగిన స్కామ్లలో వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం పెద్దది. గిరిజనుల సంక్షేమానికి ఉపయోగించాల్సిన వాల్మీకి కార్పొరేషన్ నిధులను కొందరు దారి మళ్లించారు. తెలంగాణ(Telangana), ఏపీ(Andhra Pradesh)లోని 18 వేర్వేరు నకిలీ ఖాతాల్లో రూ.89.62 కోట్లు జమ చేసినట్లు ఈడీ ఆరోపించింది. ఈ స్కామ్లో మనీలాండరింగ్(Money laundering) జరిగినట్లు ఈడీ పేర్కొంది. ఈ మేరకు మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) నిబంధనల కింద బళ్లారిలోని ఐదు చోట్ల, బెంగళూరులోని మూడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఎంపీ తుకారాంతో పాటు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భరత్ రెడ్డి(బళ్లారి నగరం), జె.ఎన్. గణేష్(కాంప్లి), ఎన్.టి.శ్రీనివాస్(కుడ్లిగి)లకు చెందిన ఇళ్లలో అధికారులు సోదాలు చేశారు.