అక్షరటుడే, వెబ్డెస్క్:Election Commission | కాంగ్రెస్ నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ (BJP match fixing) చేసిందని, రిగ్గింగ్కు పాల్పడి గెలిచిందని రాహుల్ గాంధీ ఎక్స్లో పోస్ట్ చేశారు.
ఎన్నికల కమిషనర్ల నియామకం ప్యానల్ను తారుమారు చేయడం, దొంగ ఓట్లను చేర్చడం, ఓటింగ్ శాతాన్ని కృత్రిమంగా పెంచడం ద్వారా బీజేపీ (BJP) గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. బీహార్లో కూడా ఇలాగే చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
కాగా.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఈసీ (Election Commission of India) తీవ్రంగా స్పందించింది. మహారాష్ట్ర ఎన్నికలపై (Maharashtra elections) రాహుల్ ఆరోపణలు నిరాధారం అని కొట్టిపారేసింది. అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా రాహుల్ గాంధీ మాట్లాడారని పేర్కొంది. ఇలాంటి ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఈసీ హెచ్చరించింది.