అక్షరటుడే ఇందూరు: Nizamabad Collector | భూసమస్యలను సులభంగా పరిష్కరించేలా భూభారతి చట్టం రూపొందించబడిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanthu) తెలిపారు. ఆదివారం నిజామాబాద్ నార్త్, సౌత్ (Nizamabad North, South) మండలాల పరిధిలోని రైతులకు అర్సపల్లిలో (Arsapalli) అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధరణితో కలిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం భూభారతిని తీసుకొచ్చిందన్నారు. నూతన ఆర్ఓఆర్ చట్టం (ROR Act) ద్వారా రైతులు సెక్షన్–4లోని సబ్ సెక్షన్–4, 5 ప్రకారం భూ రికార్డులను సవరణ చేసుకునే అవకాశం కల్పించామని సూచించారు.
ఆర్డీవో.. కలెక్టర్ స్థాయిల్లో రెవెన్యూ కోర్టులు వెలువరించే ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే ల్యాండ్ ట్రిబ్యునల్ను (Land Tribunal) ఆశ్రయించవచ్చని, సీసీఎల్ఏకు (CCLA) రివిజన్ అధికారాలు సైతం కల్పించారని తెలిపారు. ఆధార్ తరహాలోనే.. భూధార్ (Bhudhar)సంఖ్య కేటాయిస్తారని, దీనివల్ల భూవివాదాలకు ఆస్కారం ఉండదని, ఆక్రమణలకు అడ్డుకట్టపడుతుందని చెప్పారు. సదస్సులో ఇన్ఛార్జి ఆర్డీవో స్రవంతి, సౌత్, నార్త్ తహశీల్దార్లు బాలరాజు, నాగార్జున, రైతులు పాల్గొన్నారు.