అక్షరటుడే, వెబ్డెస్క్: Eastern Railway : సోషల్ మీడియా (social media) అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిఒక్కరూ మొబైల్స్(mobiles)లో గంటల కొద్దీ గడుపుతున్నారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్(Instagram), యూట్యూబ్ Youtubeలో వీడియోలు వీక్షిస్తూ గడిపేస్తున్నారు. వీక్షకులను ఆకట్టుకునేందుకు కొందరు విచిత్రమైన పనులు చేస్తూ వీడియోలు రూపొందిస్తున్నారు.
ఈ క్రమంలో ఇతరులను ఇబ్బంది పెట్టడమే కాకుండా వారు రిస్క్కి గురవుతున్నారు. రీల్స్ పిచ్చి(reels craze)లో యువత విపరీత చేష్టలకు, ప్రాణాంతక సాహసాలకు పాల్పడుతుండటం భయబ్రాంతులకి గురిచేస్తోంది. రీల్స్ మోజులో కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా రైల్వే స్టేషన్స్లో ఫొటోలు, వీడియోలు తీయడం మానుకోవాలని యూట్యూబర్లు(YouTubers), బ్లాగర్లను రైల్వే శాఖ సూచిస్తోంది.
Eastern Railway : అలా చేయకండి..
సమాజంలో ఫేమస్ కావడానికి పిచ్చి చేష్టలతో రీల్స్ చేస్తూ కొంతమంది వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. రీల్స్ పేరుతో రోడ్లు, పబ్లిక్ ప్రాంతాలు, మెట్రో రైళ్లు (Metro Rail) ఎయిర్పోర్ట్లు, బస్స్టాండ్ వంటి వాటిని వేదికగా మార్చుకుంటున్నారు. ఇలా ఇతరులను ఇబ్బందికి గురిచేసేలా రీల్స్ చేస్తూ కొందరు అరెస్టు కాగా, మరికొంతమంది అయితే ఏకంగా తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు.
రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఒక వ్యాధిలా మారిపోయింది. అందరి దృష్టిని ఆకర్షించడానికి, సబ్స్క్రైబర్లను, లైక్లను, షేర్లను పెంచుకోడానికి రీల్స్ పేరుతో వీడియోలు తీసి సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఈస్టర్న్ రైల్వే Eastern Railway కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే స్టేషన్ల పరిధిలో యూట్యూబర్లు, బ్లాగర్లు వీడియోలు, ఫొటోలు తీయకుండా జాగ్రత్త వహించాలని ఆదేశించింది. భద్రతాపరమైన కారణాల వల్ల ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
“స్టేషన్లు, ప్లాట్ఫామ్లు, ట్రాక్ల వంటి ప్రదేశాల్లో అనుమతి లేకుండా ఫొటోలు లేదా వీడియోలు తీయడం చట్ట విరుద్ధం. ఇది రైల్వే భద్రతను ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్(Facebook) వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వ్లాగింగ్ చేసే కంటెంట్ క్రియేటర్లను ఉద్దేశించి ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.” అని ఓ అధికారి తెలిపారు.
అనేకమంది ట్రైన్ వ్లోగ్స్(train vlogs), స్టేషన్ రివ్యూలు(station reviews), ప్రయాణ అనుభవాలు(travel experiences) తదితర విషయాలను వీడియో రూపంలో తీస్తూ పోస్ట్ చేస్తుంటారు. అయితే, ఇటీవలి కాలంలో కొన్ని ఘటనలు రైల్వే భద్రతపై అనుమానాలు కలిగించాయి. రైల్వే అధికారుల ప్రకారం రైల్వే ప్రాంగణంలో వీడియోలు తీయాలంటే ప్రత్యేక అనుమతి అవసరం. చట్ట విరుద్ధంగా వీడియోలు తీసిన వారిపై సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటారు.