అక్షరటుడే, వెబ్డెస్క్: Earthquake : గ్రీకు ద్వీపం Greek island కాసోస్ Kasos ప్రాంతంలో బుధవారం (మే 14) బలమైన భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. 14 కిలోమీటర్ల లోతులో ఏర్పడిన ఈ భూకంపం చాలా శక్తివంతంగా ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావం ఇజ్రాయెల్, లిబియా, ఈజిప్ట్, టర్కియే Israel, Libya, Egypt, Turkeyతో పాటు మొత్తం తూర్పు మధ్యధరా ప్రాంతం(Mediterranean region)లో కనబడింది. భూకంపం అనంతరం అధికారులు హెచ్చరిక జారీ చేశారు.
భూకంపం వల్ల తక్షణ నష్టం, ప్రాణనష్టం సంభవించనప్పటికీ, టెక్టోనిక్గా చురుకైన ఈ ప్రాంతంలో మరోసారి భయానక వాతావరణాన్ని ఏర్పర్చింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో భూకంపాల ప్రభావం ఎక్కువగా ఉంది. మారుతున్న పర్యావరణానికి ప్రమాదకరమైన సంకేతాలలో ఒకటిగా దీనిని విశ్లేషకులు భావిస్తున్నారు.
యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) నివేదిక ప్రకారం, భూకంపం 22:51:16 UTCకి ఏర్పడింది. భూకంప కేంద్రం కాసోస్ ద్వీపం తీరంలో గుర్తించారు. ఇది క్రీట్, రోడ్స్ నడుమ ఉంది. ఇవి ఏజియన్ సముద్రంలోని రెండు ప్రసిద్ధ గ్రీకు గమ్యస్థానాలుగా నిర్ధారించారు.
సుమారు వెయ్యి మంది జనాభా నివసించే కాసోస్ ద్వీపం.. సుందరమైన ప్రకృతి దృశ్యం, ప్రశాంత వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. ఇది ఏకాంతాన్ని కోరుకునే వారికి ప్రశాంతమైన పర్యాటక ప్రదేశంగా ఆకర్షిస్తుంది. 6.1 తీవ్రతతో భూకంపం ఏర్పడిందని, ఇది విస్తృతమైన ప్రకంపనలు, భారీ నష్టం సంభవించే అవకాశాన్ని సూచిస్తుందని యూఎస్జీఎస్ పేర్కొంది.