అక్షరటుడే, వెబ్డెస్క్: Earthquake : ఈక్వడార్(Ecuador) దేశంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.3 గా నమోదైంది. భూకంప దాటికి ఈస్మెరాల్డాస్ పోర్టు నగరంలో కనీసం 20 మందికి గాయాలు జరిగాయి. పలు భవనాలు ధ్వంసమయ్యాయి.
యూరోపియన్ మెడిటరేనియన్ సెస్మోలాజికల్ సెంటర్ ప్రకారం.. ఈ భూకంపం శుక్రవారం ఈక్వడార్ తీరానికి సమీపంలో భూమి ఉపరితలం నుంచి 30 కిలోమీటర్ల లోతులో సంభవించింది. భూ ప్రకంపనల వల్ల ఇళ్లు, ప్రభుత్వ భవనాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్తు సరఫరా నిలిపివేయబడింది. చమురు మౌలిక సదుపాయాలను తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భూకంపం ఏర్పడిన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు డేనియల్ నొబోఆ మాట్లాడుతూ, “మంత్రులందరిని బాధిత ప్రావిన్స్కు పంపిస్తున్నామన్నారు. ఇళ్లు కోల్పోయినవారికి తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేస్తామని, సహాయ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు ” తెలిపారు.