అక్షరటుడే, వెబ్డెస్క్ : EAPCET | విద్యార్థులకు తెలంగాణ ఉన్న విద్యామండలి శుభవార్త చెప్పింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహించిన ఏఈపీసెట్ పరీక్ష EAPCET Results ఫలితాలను ఆదివారం విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి cm revanth reddy ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు.
అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రెన్స్ కోసం ఏప్రిల్ 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం మే 2 నుంచి 4 వరకు ఆరు సెషన్లలో ఎగ్జామ్ పెట్టారు. ఈ పరీక్షలు సీబీటీ CBT (ఆన్లైన్) విధానంలో జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,88,388 విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరు ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి ఆదివారం ఉదయం 11 గంటలకు తన నివాసంలో ఫలితాలు విడుదల చేయనున్నారు.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) విధానంలో పరీక్షలు జరగడంతో వారం, 10 రోజుల వ్యవధిలోనే ఫలితాలు విడుదల చేయనున్నారు. అఫిషీయల్ వెబ్సైట్ eapcet.tgche.ac.in లో విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాల విడుదల అనంతరం ఉన్నత విద్యా మండలి విద్యార్థుల రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల షెడ్యూల్ కు సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.