అక్షరటుడే, వెబ్డెస్క్: e Passport | కేంద్ర ప్రభుత్వం ఈ–పాస్పోర్టు e Passport సేవలను ప్రారంభించింది. దేశంలోని ప్రధానమైన 12 నగరాల్లో ఈ విధానం అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికుల భద్రత, వేగవంతమైన సేవలు, నకిలీ పాస్పోర్టుల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ఈ–పాస్పోర్టు సేవలను అందుబాటులోకి తెచ్చింది. మొదట 12 నగరాల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్లు, బయోమెట్రిక్ డేటా ఇందులో పొందుపరుస్తారు.
e Passport | ఆ 12 నగరాలు ఇవే..
చెన్నై, జైపూర్, హైదరాబాద్, నాగపూర్, అమృత్సర్, గోవా, భువనేశ్వర్, జమ్మూ, షిమ్లా, రాయపూర్, సూరత్, రాంచి నగరాల్లో ఈ–పాస్పోర్టు విధానం ప్రారంభించారు. ఇన నుంచి ప్రయాణికులు ఆయా ప్రాంతాలో ఈ–పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. చిప్ ఆధారిత ఈ–పాస్పోర్టులతో నకిలీ పాస్పోర్టులకు అడ్డుకట్ట వేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఇమ్మిగ్రేషన్ సమయం Immigration తగ్గుతుంది.
e Passport | ఉపయోగాలు ఏంటంటే..
అధునాతన ఈ–పాస్పోర్టుతో మెరుగైన భద్రత Improved security, వేగవంతమైన ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ అందించవచ్చు. ఈ విధానాన్ని చెన్నైలో గతంలోనే ప్రారంభించారు. ఈ-పాస్పోర్ట్ సాంప్రదాయ పాస్పోర్ట్ను పోలి ఉన్నప్పటికీ, అదనపు భద్రత, సాంకేతికతతో కూడిన చిప్ ఉంటుంది. ఆ చిప్లో ప్రయాణికుడి వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. వేలిముద్రలు biometric, ఐరిస్ iris స్కాన్లతో సహా అందులో ఉంటాయి. దీంతో నకిలీ పాస్పోర్టులు తయారు చేయడం కుదరదు. ఈ డాటా డిజిటల్ ఎన్క్రిప్షన్ ద్వారా సురక్షితంగా ఉంటుంది. ట్యాంపరింగ్ చేయడానికి వీలు లేకుండా రూపొందించారు.
ఈ-పాస్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయాలలో త్వరిత, ఆటోమేటెడ్ గుర్తింపు ధృవీకరణను అనుమతిస్తుంది. దీంతో ఇమ్మిగ్రేషన్ కౌంటర్లలో వేచి ఉండే సమయం తగ్గుతుంది. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఇమ్మిగ్రేషన్ గేట్లతో అనుకూలంగా ఉంటాయి.