అక్షరటుడే, హైదరాబాద్: DSP transfers : రాష్ట్రంలో పలువురు డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీలో డీఎస్పీగా ఉన్న ప్రశాంత్ రెడ్డిని వరంగల్ కమిషనరేట్ కాజీపేట ఏసీపీగా బదిలీ చేశారు. సిద్దిపేట సిసిఆర్బిలో ఉన్న శంకర్ రెడ్డిని మేడ్చల్ ఏసీపీగా ట్రాన్స్ ఫర్ చేశారు. అక్కడ పనిచేస్తున్న ఏసీపీ శ్రీనివాస్ రెడ్డిని డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేశారు.
రాచకొండ ఎస్ఓటీలో ఉన్న ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ ను శంషాబాద్ ఏసీపీగా నియమించారు. ఖమ్మం సీసీఆర్బిలో పున్నం రవీందర్ రెడ్డిని నర్సంపేట్ ఏసీపీగా ట్రాన్స్ ఫర్ చేశారు. అక్కడ ఉన్న కిరణ్ కుమార్ ను డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు.
పోలీస్ అకాడమీ లో ఉన్న సారంగపాణిని వైరా ఏసీపీ గా నియమించారు. వైరా ఏసీపీగా ఉన్న రహీమ్ ను డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు. కాగా.. ముగ్గురు డీఎస్పీలను పోస్టింగుల నుంచి తప్పించడం చర్చకు దారితీసింది.