ePaper
More
    Homeక్రీడలుMohammed Siraj | సిక్స‌ర్ కొట్టిన డీఎస్పీ సాబ్.. ప‌ట్టు బిగించిన టీమిండియా

    Mohammed Siraj | సిక్స‌ర్ కొట్టిన డీఎస్పీ సాబ్.. ప‌ట్టు బిగించిన టీమిండియా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Mohammed Siraj | ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో (Second test match) భారత్ ప‌ట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల ఆధిక్యం సాధించిన టీమిండియా (Team india), మూడో రోజు ఆట ముగిసే సరికి రెండో ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (22 బంతుల్లో 6 ఫోర్లతో 28) దూకుడుగా ఆడి వెనుదిరిగాడు. ఆయన ఔట్ అయిన తర్వాత కేఎల్ రాహుల్ (Kl Rahul) (28 బ్యాటింగ్), కరుణ్ నాయర్ (7 బ్యాటింగ్) లతో కలిసి ఇంకొక వికెట్‌ను కోల్పోకుండా ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. జోష్ టంగ్ ఒక వికెట్ తీసుకున్నాడు. ప్రస్తుతం భారత్ మొత్తం ఆధిక్యం 244 పరుగులు.

    Mohammed Siraj | గెలుస్తుందా..

    అంతకు ముందు 77/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లిష్​ జట్టు (England team) తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. జెమీ స్మిత్ (207 బంతుల్లో 21 ఫోర్లు, 4 సిక్స్‌లతో 184 నాటౌట్), హ్యారీ బ్రూక్ (234 బంతుల్లో 17 ఫోర్లు, సిక్స్‌తో 158) అద్భుత శతకాలతో రాణించారు. ఈ ఇద్దరు 6వ వికెట్‌కు కలిసి 303 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యానికి ఆకాశ్ దీప్ అడ్డుక‌ట్ట వేశాడు. హ్యారీ బ్రూక్‌ను బౌల్డ్ చేసి ఇంగ్లండ్ దూకుడుకు బ్రేక్ వేశాడు. భారత బౌలర్లలో ముహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) 6 వికెట్లతో చెలరేగాడు. ఆకాశ్ దీప్ 4 వికెట్లు తీయగా ఇంగ్లండ్ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోర్ చేసిన సంగతి తెలిసిందే.

    READ ALSO  INDVsENG | బ‌జ్ బాల్ ఆట‌తో ఇంగ్లండ్‌ని ఆదుకున్న బ్రూక్, స్మిత్.. ఇంగ్లండ్ స్కోరు ఎంతంటే..

    ఇప్పుడు భారత్ ఫోర్త్​ డే ఆటలో మెరుగైన బ్యాటింగ్ చేస్తే, ఇంగ్లండ్‌కు 450 – 500 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించవచ్చు. అలా చేస్తే గెలిచే అవకాశాలు మెరుగవుతాయి. కానీ 400లోపు లక్ష్యం నిర్దేశిస్తే మాత్రం బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిన ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌పై ఆ టార్గెట్‌ ఇంగ్లండ్ సులభంగా ఛేదించే అవకాశం ఉంది. కొత్త బంతితోనే బౌలర్లకు సహాయం లభిస్తోంది. తొలి టెస్ట్‌లో భార‌త్ (India frist test match) అద్భుతంగా బ్యాటింగ్ చేసిన కూడా బౌల‌ర్స్ పెద్ద‌గా ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చ‌క‌పోవ‌డంతో టీమిండియా ఓట‌మి పాలైంది. మ‌రి రెండో టెస్ట్‌లో ఏం చేస్తారో చూడాలి.

    Latest articles

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    Nizamabad CP | విద్యాసంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad CP | విద్యా సంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని...

    More like this

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...