More
    Homeజిల్లాలునిజామాబాద్​DS Statue | డీఎస్​ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తి

    DS Statue | డీఎస్​ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: DS Statue | జాతీయ పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభానికి కేంద్రమంత్రి అమిత్ షా (Union Minister Amit Shah) రానున్న నేపథ్యంలో జిల్లాలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం.. కంఠేశ్వర్​ బైపాస్ (Kanteshwar Bypass)​ వద్ద డీఎస్​ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు.

    DS Statue | రూ. 40లక్షలతో కాంస్య విగ్రహం తయారీ

    ఎంపీ అర్వింద్​ తన సొంత నిధులు రూ. 40లక్షలతో కాంస్య విగ్రహాన్ని తయారు చేయించారు. గుజరాత్​లోని సర్దార్​ వల్లభాయ్​ పటేల్ (Sardar Vallabhbhai Patel) విగ్రహాన్ని రూపొందించిన పద్మ భూషణ్ రామ్ సుతార్ (Padma Bhushan Ram Sutar) అనే వ్యక్తి డీఎస్ విగ్రహాన్ని తయారు చేశారు. తేదీల ప్రకారం 29న మొదటి వర్ధంతి కావడంతో కేంద్రమంత్రి అమిత్ షా చేతుల మీదుగా విగ్రహాన్ని ప్రారంభింపజేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

    READ ALSO  Kotagiri |విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

    DS Statue | పసుపు బోర్డు కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తి

    ఆర్యనగర్​లోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయాన్ని పసుపు బోర్డుకు కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో కార్యాలయంలో ఫర్నిచర్, ఇతర సామగ్రి సిద్ధం చేశారు. ఇప్పటికే బోర్డు కార్యదర్శిగా ఐఏఎస్ భవానీశ్రీని నియమించారు.

    DS Statue | పాలిటెక్నిక్​ మైదానంలో..

    బైపాస్​ రోడ్డులో డీఎస్​ విగ్రహావిష్కరణ అనంతరం పాలిటెక్నిక్ మైదానంలో (Polytechnic Ground) ఏర్పాటుచేసిన రైతు సభలో అమిత్​షా పాల్గొని ప్రసంగిస్తారు. సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. మహిళలకు, పురుషులకు వేర్వేరు గ్యాలరీలు సిద్ధం చేశారు. వర్షం పడినా సభకు అంతరాయం ఏర్పడకుండా పెద్ద షెడ్డు వేశారు. అలాగే కేంద్ర రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఒకరోజు ముందుగానే జిల్లాకు చేరుకున్నారు. భద్రతా ఏర్పాట్లపై జిల్లా పోలీసుల సమన్వయంతో సమీక్షించారు.

    READ ALSO  Home Minister Amit Shah | కేంద్ర హోంమంత్రి పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు

    Latest articles

    Turmeric Board | పసుపు రైతులకు పండుగే..

    అక్షరటుడే, ఇందూరు : Turmeric Board | పసుపు రైతుల దశాబ్దాల కళ నెరవేరడమే కాకుండా ఇందూరు కేంద్రంగా...

    Farmers | యూరియా కోసం రైతుల తిప్పలు.. ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఆగ్రహం

    అక్షరటుడే, ఆర్మూర్ : Farmers | వానాకాలం సాగు పనులు ప్రారంభం అయ్యాయి. పలు గ్రామాల్లో వరి నాట్లు...

    Dattatreyudu Nori | ప్రభుత్వ సలహాదారుగా వైద్య నిపుణుడు దత్తాత్రేయుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dattatreyudu Nori | తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు (Dattatreyudu Nori...

    Minister Uttam | పాత ప్రాజెక్టుల పునరుద్ధరణ.. కొత్త ప్రాజెక్టులకు ప్రాధాన్యం.. నీటి భద్రతే ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి ఉత్తమ్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Minister Uttam | నీటి భద్రతే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర నీటి పారుదల శాఖ...

    More like this

    Turmeric Board | పసుపు రైతులకు పండుగే..

    అక్షరటుడే, ఇందూరు : Turmeric Board | పసుపు రైతుల దశాబ్దాల కళ నెరవేరడమే కాకుండా ఇందూరు కేంద్రంగా...

    Farmers | యూరియా కోసం రైతుల తిప్పలు.. ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఆగ్రహం

    అక్షరటుడే, ఆర్మూర్ : Farmers | వానాకాలం సాగు పనులు ప్రారంభం అయ్యాయి. పలు గ్రామాల్లో వరి నాట్లు...

    Dattatreyudu Nori | ప్రభుత్వ సలహాదారుగా వైద్య నిపుణుడు దత్తాత్రేయుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dattatreyudu Nori | తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు (Dattatreyudu Nori...