అక్షరటుడే, వెబ్డెస్క్:Cyberabad Police | హైదరాబాద్ (Hyderabad city) నగరంలో వారాంతంలో మందుబాబులు రెచ్చిపోతున్నారు. పీకల్లోతు తాగి వాహనాలు నడుపుతున్నారు. దర్జాగా మద్యం మత్తులో వాహనాలు నడిపి పోలీసులకు చిక్కుతున్నారు. ఈ క్రమంలో వరుస ప్రమాదాలకు కారణం అవుతున్నారు. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం డ్రంకన్ డ్రైవ్(Drunk and drive) వల్లే జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలో ప్రతి శని, ఆదివారాల్లో స్పెషల్ డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు (drunken driving chekings) నిర్వహిస్తున్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Cyberabad Traffic Police) శనివారం, ఆదివారం ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. 305 మంది మందుబాబులు చిక్కారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దొరికిన వారిలో బైక్పై వెళ్తున్న వారే ఎక్కువ మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా వీరిని పోలీసులు కోర్టు(Court)లో ప్రవేశ పెట్టనున్నారు. డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారికి కోర్టులు ఫైన్తో పాటు జైలు శిక్ష కూడా విధిస్తున్నాయి.