అక్షరటుడే, భీమ్గల్: Bheemgal | మాదకద్రవ్యాల నియంత్రణ మన అందరి బాధ్యతని భీమ్గల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల (Bheemgal Government Junior College) ప్రిన్సిపాల్ సి.జైపాల్ రెడ్డి అన్నారు. మాదకద్రవ్యాల (Narcotics) నియంత్రణ, నివారణపై కళాశాలలో విద్యార్థులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును చిన్నాభిన్నం చేసుకుంటుందన్నారు. అనంతరం మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు. ప్రతి ఒక్కరికి వీటితో జరిగే దుష్పరిణామాలపై అవగాహన ఉండాలని సూచించారు. తదనంతరం ఇందుకు సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అధ్యాపక బృందం డాక్టర్ మాండలోజు నరసింహాస్వామి, పల్లె శ్రీనివాస్ గౌడ్, సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.