అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | హైదరాబాద్(Hyderabad)లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్, బోరబండ తదితర ప్రాంతాల్లోని 50కు పైగా బస్తీలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన రిజర్వాయర్(Reservoir)ను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి(Union Minister Kishan Reddy) శనివారం ప్రారంభించారు. రహమత్నగర్లోని ఎస్పీఆర్ హిల్స్(SPR Hills)తో రూ.ఆరు కోట్లతో ఈ రిజర్వాయర్ను జలమండలి నిర్మించింది. మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో కలిసి కిషన్రెడ్డి రిజర్వాయర్ను ప్రారంభించారు.
రిజర్వాయర్ ప్రారంభించిన అనంతరం కిషన్రెడ్డి మాట్లాడుతూ.. బోరబండ చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని చాలా రోజులుగా ఆలోచిస్తున్నామని చెప్పారు. ఏళ్ల క్రితం రిజర్వాయర్(Reservoir) పనులు ప్రారంభమైనా అనేక అడ్డంకులతో పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయన్నారు. దీంతో ప్రజలకు తాగునీరు అందించడానికి దీనిని ప్రారంభించినట్లు తెలిపారు. స్థానికంగా ఉన్న బస్తీవాసులకు ఇక తాగునీటి కష్టాలు ఉండవన్నారు.
Hyderabad | హైదరాబాద్ అభివృద్ధికి చర్యలు
హైదరాబాద్(Hyderabad) రోజు రోజుకు విస్తరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 33 శాతం జనాభా జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలో ఉన్నారన్నారు. దేశంలో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్ను మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. రోడ్ల విస్తరణ, తాగునీటి సౌకర్యానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు.