అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai Congress | ఇందల్వాయి మండలంలోని జీకే తండాలో బోర్లు వేయించి తాగునీటి సమస్యను పరిష్కరించినట్లు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.
తండాల్లో చాలారోజులుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (Rural MLA Bhupathi Reddy) దృష్టికి తీసుకెళ్లారు.ఆయన స్పందించి బోరు మంజూరు చేశారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు మహిపాల్ నాయక్, గౌరారం మాజీ ఎంపీటీసీ మలావత్ జమునా పరశురాం, జీకే తండా వీడీసీ ఛైర్మన్ ఖత్రోత్ పీరు, వైస్ ఛైర్మన్ రమేశ్, కాంగ్రెస్ గ్రామాధ్యక్షుడు ఆకాష్, తండా నాయకులు పాల్గొన్నారు.