అక్షరటుడే, ఇందూరు: Jawahar Navodaya | జిల్లాకు నూతనంగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయ తరగతులకు ఎటువంటి ఆటంకం కలుగకుండా చూడాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanthu) అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని నాగారంలో ఉన్న డైట్ కళాశాల(Diet College) ఆవరణలోని భవనాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తాత్కాలిక భవనంలో బోధనా తరగతులు, సిబ్బందికి వసతి, బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ భవనాలు, స్టాఫ్ క్వార్టర్స్, లైబ్రరీ, డైనింగ్ హాల్ను పరిశీలించారు.
తాత్కాలిక భవనంలో కొనసాగుతున్న మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈనెల 12వ తేదీ లేపు పనులను పూర్తి చేయాలన్నారు. పనులను నాణ్యతతో జరిపించాలని, చెత్తాచెదారం నిరుపయోగంగా ఉన్న వస్తువులను తొలగించాలన్నారు. శాశ్వత భవనం అందుబాటులోకి వచ్చేవరకు డైట్ కళాశాల ప్రాంగణంలో తరగతులు కొనసాగుతాయని తెలిపారు.
Jawahar Navodaya | ఆరో తరగతిలో ప్రవేశాలు..
ఈ విద్యా సంవత్సరం నుంచి ఆరో తరగతిలో ప్రవేశాలు చేపట్టడం జరుగుతుందన్నారు. మొత్తం 80 మంది విద్యార్థులు రెండు సెక్షన్లలో ప్రవేశం పొందుతారని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట డీఈవో, జవహర్ నవోదయ విద్యాలయ ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ యోహన్న, పంచాయతీరాజ్ ఈఈ శంకర్ తదితరులున్నారు.