More
    Homeఅంతర్జాతీయంPahalgam terror attack | కశ్మీర్ వెళ్లొద్దు..తమ పౌరులకు అమెరికా అడ్వైజరీ జారీ

    Pahalgam terror attack | కశ్మీర్ వెళ్లొద్దు..తమ పౌరులకు అమెరికా అడ్వైజరీ జారీ

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Pahalgam terror attack : భారత్​లోని అమెరికా american citizens india పౌరులకు ఆ దేశం అడ్వైజరీ జారీ చేసింది. జమ్మూకశ్మీర్​కు వెళ్లొద్దని సూచించింది. జమ్మూకాశ్మీర్​లోని పహల్గామ్​లో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అమెరికా ఈ అడ్వైజరీ us advisory to citizens జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్​కు వెళ్లవద్దని అమెరికా బుధవారం తన పౌరులకు సూచించింది.

    “జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత Union Territory of Jammu and Kashmir ప్రాంతంలో ఉగ్రవాద దాడులు, హింసాత్మక పౌర అశాంతి సంభవించే అవకాశం ఉంది. ఈ రాష్ట్రానికి ప్రయాణించవద్దు(తూర్పు లడఖ్ ప్రాంతం eastern Ladakh region, దాని రాజధాని లేహ్ capital Leh సందర్శనలను మినహాయించి). ఈ ప్రాంతంలో హింస అప్పుడప్పుడు జరుగుతుంది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య నియంత్రణ రేఖ వెంబడి హింసాత్మక ఘటనలు సర్వసాధారణం. ఇది కశ్మీర్ లోయలోని పర్యాటక ప్రదేశాలైన శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్​ల( Kashmir Valley, Srinagar, Gulmarg, Pahalgam) లో కూడా జరుగుతుంది. భారత ప్రభుత్వం విదేశీ పర్యాటకులను నియంత్రణ రేఖ వెంబడి కొన్ని ప్రాంతాలను సందర్శించడానికి అనుమతించదు” అని ఇండియాలోని యూఎస్ రాయబార కార్యాలయం పేర్కొంది.

    Pahalgam terror attack : కశ్మీర్​ను వీడుతున్న పర్యాటకులు..

    ఉగ్రదాడి తర్వాత పర్యాటకులు పెద్ద సంఖ్యలో కాశ్మీర్​ను వీడుతున్నారు. గంటల వ్యవధిలోనే వేలాది మంది తిరుగు ప్రయాణమయ్యారు. స్పైస్జెట్, ఎయిర్ ఇండియాతో సహా అనేక విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు ప్రయాణ సలహాలు జారీ చేశాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పర్యాటకులు తిరిగి రావడానికి వీలుగా శ్రీనగర్ నుంచి విమానాల సంఖ్యను పెంచాలని పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ విమానయాన సంస్థలను కోరింది. అంతేకాకుండా, శ్రీనగర్ విమాన టిక్కెట్ల రద్దు, రీషెడ్యూల్ రుసుములను రద్దు చేయడాన్ని పరిగణించాలని కూడా విమానయాన సంస్థలకు సూచించింది.

    Latest articles

    Srisailam | శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండను ఢీకొన్న బస్సు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Srisailam | శ్రీశైలం Srisailam  ఘాట్​ రోడ్డు Ghat Road లో గురువారం ప్రమాదం...

    Terror Attack | పాక్​ ఎంబసీ వద్ద ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terror Attack | ఢిల్లీ Delhiలోని పాక్‌ హై కమిషనర్‌ కార్యాలయం(Pakistan High Commission...

    Bjp Nizamabad | ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి హెల్ప్ సెంటర్

    అక్షరటుడే, ఇందూరు: Bjp Nizamabad | ఉపాధ్యాయులు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు...

    Pakistan High Commission | పాక్‌ హై కమిషన్‌పై చర్యలు షురూ..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కశ్మీర్‌ ఉగ్రదాడి(terrorist attack) ఘటనను కేంద్రం అత్యంత సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. పాక్‌ ప్రేరేపిత...

    More like this

    Srisailam | శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండను ఢీకొన్న బస్సు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Srisailam | శ్రీశైలం Srisailam  ఘాట్​ రోడ్డు Ghat Road లో గురువారం ప్రమాదం...

    Terror Attack | పాక్​ ఎంబసీ వద్ద ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terror Attack | ఢిల్లీ Delhiలోని పాక్‌ హై కమిషనర్‌ కార్యాలయం(Pakistan High Commission...

    Bjp Nizamabad | ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి హెల్ప్ సెంటర్

    అక్షరటుడే, ఇందూరు: Bjp Nizamabad | ఉపాధ్యాయులు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు...