అక్షరటుడే, బోధన్: కల్తీ కల్లుకు బానిసలుగా మారి కుటుంబాలను రోడ్డుపాలు చేయవద్దని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ (Bodhan ACP Srinivas) పేర్కొన్నారు. బుధవారం పట్టణంలో నార్కోటిక్ శాఖ (Narcotic Department) ఆధ్వర్యంలో కల్తీకల్లుతో(Kalthi kallu) జరిగే దుష్ఫరిణామాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ కల్తీకల్లు కారణంగా వేల కుటుంబాలు నాశనమవుతున్నాయని, దీనికి దూరంగా ఉండాలని ఆయన అవగాహన కల్పించారు. ర్యాలీలో నార్కోటిక్ ఏసీపీ సుబ్బిరామిరెడ్డి, టౌన్ సీఐ వెంకటనారాయణ వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న బోధన్ ఏసీపీ శ్రీనివాస్
Narcotic police | ఆర్మూర్లో అవగాహన ర్యాలీ..

ఆర్మూర్లో ర్యాలీ నిర్వహిస్తున్న నార్కోటిక్స్ పోలీసులు
అక్షరటుడే, ఆర్మూర్ : మండలంలోని చేపూర్లో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో బుధవారం ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యాంటీ నార్కోటిక్ బ్యూరో పుష్యన్ కుమార్ హాజరై మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.