అక్షరటుడే, ఇందూరు: Rotary Club of Gems | రక్తదానం ప్రాణదానంతో సమానమని రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ అధ్యక్షుడు పద్మ శ్రీనివాస్ అన్నారు. గురువారం రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ ఆధ్వర్యంలో రెడ్క్రాస్ సొసైటీలో(Red Cross Society) రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 17 మంది సభ్యులు రక్తదానం చేశారు. అనంతరం పద్మ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి (Blood donation) ముందుకు రావాలని సూచించారు. క్లబ్ సభ్యుడు కోటగిరి చంద్రశేఖర్ వందసార్లు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు గౌరీశంకర్, సూర్యప్రకాశ్, వీరబ్రహ్మం, రమేష్, డాక్టర్ వినోద్ పవార్, చంద్రశేఖర్, శ్రీనివాస్, రాజశేఖర్, నేతి శేఖర్, రాంప్రసాద్ పాల్గొన్నారు.