ePaper
More
    HomeజాతీయంVande Bharat Train | నాందేడ్ నుంచి ముంబైకి వందేభారత్.. ఎన్ని గంటల్లో వెళ్తారో తెలుసా..!

    Vande Bharat Train | నాందేడ్ నుంచి ముంబైకి వందేభారత్.. ఎన్ని గంటల్లో వెళ్తారో తెలుసా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vande Bharat Train | ప్రయాణికులకు రైల్వే శాఖ(Railway Department) గుడ్​న్యూస్​ చెప్పింది. ముంబై నుంచి జాల్నా మధ్య నడుస్తున్న వందే భారత్​ రైలును నాందేడ్​ వరకు పొడిగించింది.

    ఆధునిక హంగులతో వేగవంతమైన ప్రయాణం కోసం కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైళ్లను (Vande Bharat Trains) ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు మార్గాల్లో వందే భారత్​ ట్రైన్లు నడుస్తున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కేంద్రం మరిన్ని వందే భారత్​ రైళ్లను ప్రవేశ పెట్టాలని చూస్తోంది. అలాగే ప్రస్తుతం నడుస్తున్న పలు రైళ్లను కూడా ఇతర స్టేషన్లకు పొడిగిస్తోంది. ఇందులో భాగంగా ముంబై(Mumbai)లోని ఛత్రపతి శివాజీ టర్మినల్​ నుంచి జాల్నా మధ్య నడుస్తున్న రైలును నాందేడ్(Nanded)​ వరకు పొడిగించింది.

    READ ALSO  Uttar Pradesh | ప్యాంట్​పై సూసైడ్ నోట్ రాసి యువకుడి ఆత్మహత్య.. భార్య, పోలీసుల వేధింపులే కారణమని లేఖ

    Vande Bharat Train | పది స్టేషన్లు.. 9:25 గంటల ప్రయాణం

    ప్రస్తుతం ఉన్న ఛత్రపతి శివాజీ మహరాజ్​ టర్మినల్ (Chhatrapati Shivaji Maharaj Terminal)​– జాల్నా వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ను ఛత్రపతి శివాజీ మహరాజ్​ టర్మినల్–హుజుర్​ సాహేబ్​ నాందేడ్​ వందే భారత్​ ఎక్స్​ప్రెస్​గా మార్చారు. గతంలో ఈ ట్రెయిన్​ ముంబై నుంచి జల్నాకు 6 గంటల 50 నిమిషాల్లో వెళ్లేది. ప్రస్తుతం ముంబై నుంచి నాందేడ్​కు 9 గంటల 25 నిమిషాల్లో చేరుకోనుంది. మధ్యలో దాదర్​, థానే, కల్యాణ్​, నాసిక్​ రోడ్డు, మన్మాడ్​, ఔరంగబాద్​, జల్నా, పర్బనీ స్టేషన్​లలో ఆగనుంది.

    నాందేడ్​ నుంచి ముంబై మార్గంలో నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో రైల్వేశాఖ వందే భారత్​ రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల నుంచి వీటికి ఆదరణ వస్తుండటంతో తాజాగా జాల్నా వరకు నడుస్తున్న వందే భారత్​ రైలును నాందేడ్ వరకు పొడిగించింది.

    READ ALSO  South Central Railway | దక్షిణ మధ్య రైల్వే జీఎంగా సంజయ్​కుమార్​

    Vande Bharat Train | నిజామాబాద్​ వరకు పొడిగిస్తే మేలు

    ఉమ్మడి నిజామాబాద్(Nizamabad), కరీంనగర్ (Karim Nagar)​ జిల్లాల నుంచి నిత్యం ముంb వందలాది మంది రాకపోలకు సాగిస్తారు. సికింద్రాబాద్​ నుంచి నాందేడ్​, ముంబై మధ్య నడిచే రైళ్లలో నిత్యం రద్దీ అధికంగా ఉంటుంది. కరీంనగర్​, నిజామాబాద్​ జిల్లాలకు చెందిన ఎంతో మంది గల్ఫ్​ దేశాలకు వలస వెళ్తారు. వీరు కూడా ముంబై మీదుగా రాకపోకలు సాగిస్తారు. అలాగే ముంబైలో ఎంతో మంది స్థిరపడ్డారు. ఈ క్రమంలో వందే భారత్​ రైలును నిజామాబాద్​ వరకు పొడిగిస్తే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది.

    ప్రస్తుతం ముంబైకి రైళ్లు అందుబాటులో ఉన్నా.. ప్రైవేట్​ బస్సుల్లో చాలా మంది వెళ్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో ప్రైవేట్​ బస్సులు నిజామాబాద్​ నుంచి ముంబైకి రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో వందేభారత్​ను నిజామాబాద్​ వరకు పొడిగిస్తే ప్రయాణికులకు మేలు కలుగనుంది.

    READ ALSO  Capsule Hotels | రైల్వే స్టేష‌న్‌లో అత్యాధునిక వ‌స‌తులు.. విశాఖ‌లో ప్రారంభ‌మైన‌ క్యాప్సుల్ హోటల్స్‌

    Latest articles

    Governor Jishnu Dev Varma | గవర్నర్​కు స్వాగతం పలికిన అధికారులు

    అక్షరటుడే, డిచ్​పల్లి: Governor Jishnu Dev Varma |జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు...

    ACB Raid | పొందుర్తి చెక్​పోస్టుపై ఏసీబీ దాడులు.. డబ్బులు తీసుకుంటూ దొరికిన ఏజెంట్లు

    అక్షరటుడే, కామారెడ్డి : ACB Raid | ఏసీబీ అధికారులు(ACB Officers) అవినీతి అధికారుల ఆట కట్టిస్తున్నారు. ప్రజల...

    Supreme Court | వీధికుక్కలకు ఇంట్లో ఆహారం పెట్టొచ్చుగా.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Supreme Court | దేశవ్యాప్తంగా వీధికుక్కల(Street Dogs) బెడద ఎక్కువ అయిపోయింది. వీటి మూలంగా ప్రజలు...

    Stock Market | స్వల్ప నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic Stock Markets) స్వల్ప నష్టాలతో కొనసాగుతున్నాయి. దేశీయంగా ఎలాంటి...

    More like this

    Governor Jishnu Dev Varma | గవర్నర్​కు స్వాగతం పలికిన అధికారులు

    అక్షరటుడే, డిచ్​పల్లి: Governor Jishnu Dev Varma |జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు...

    ACB Raid | పొందుర్తి చెక్​పోస్టుపై ఏసీబీ దాడులు.. డబ్బులు తీసుకుంటూ దొరికిన ఏజెంట్లు

    అక్షరటుడే, కామారెడ్డి : ACB Raid | ఏసీబీ అధికారులు(ACB Officers) అవినీతి అధికారుల ఆట కట్టిస్తున్నారు. ప్రజల...

    Supreme Court | వీధికుక్కలకు ఇంట్లో ఆహారం పెట్టొచ్చుగా.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Supreme Court | దేశవ్యాప్తంగా వీధికుక్కల(Street Dogs) బెడద ఎక్కువ అయిపోయింది. వీటి మూలంగా ప్రజలు...