అక్షరటుడే, కామారెడ్డి : Landmine explosion| ఆపరేషన్ కర్రెగుట్టల్లో operation karreguttalu కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందగా.. అందులో కామారెడ్డి kamareddy district జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి చెందిన వడ్ల శ్రీధర్ కూడా ఉన్నాడు. శ్రీధర్ నాలుగేళ్ళ క్రితం కానిస్టేబుల్గా ఉద్యోగం పొంది గ్రేహౌండ్స్ Greyhounds విభాగంలో చేరాడు.
ఆపరేషన్ కర్రెగుట్టల్లో భాగంగా కొద్దిరోజులుగా సెర్చ్ ఆపరేషన్ Search operationలో పాల్గొంటున్నాడు. ఇంతలోనే మావోయిస్టులు పేల్చిన మందుపాతర పేలి తనువు చాలించాడు. కాగా శ్రీధర్కు గతేడాది ఆగస్టులో వివాహం అయింది. పెళ్లై ఏడాది కూడా తిరగకముందే ఈ ఘటన చోటు చేసుకోవడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. శ్రీధర్ మృతితో మాచారెడ్డి మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మావోయిస్టుల దాడిపై తెలంగాణ డీజీపీ జితేందర్ DGP Jitendar ప్రకటన విడుదల చేశారు. గురువారం ఉదయం 6 గంటలకు వాజేడు, పేరూరులో మావోయిస్టులు ల్యాండ్ మైన్లు పేల్చారని చెప్పారు. అనంతరం 40 మంది మావోయిస్టులు జవాన్లపై కాల్పులకు తెగబడ్డారని పేర్కొన్నారు. మందుపాతర పేలి శ్రీధర్, పవన్, సందీప్ మృతి చెందారని చెప్పారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతుందని ఆయన వివరించారు.