అక్షరటుడే, వెబ్డెస్క్ : Farmers | ములుగు (Mulugu) జిల్లా వాజేడు మండలంలో మొక్కజొన్న పంట నష్టపోయిన రైతులకు సోమవారం పరిహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రులు సీతక్క (Seethakk), తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara rao), రైతు కమిషన్ సభ్యులు పాల్గొన్నారు. రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు గడుగు గంగాధర్ (Gadugu Gangadhar), రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి (Anvesh Reddy) తదితులు పాల్గొన్నారు. ములుగు జిల్లాకు వచ్చిన వీరిని మంత్రి సీతక్క సన్మానించారు. అనంతరం నష్టపోయిన రైతులకు చెక్కులు అందజేశారు.
